Andhra Pradesh

తెలంగాణపై 5న పార్టీలతో కేంద్రం చర్చలు

న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్దిష్టమైన చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. గుర్తింపు పొందిన రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీలను డిల్లీలో చర్చలకు అహ్వానించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికింది. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జనవరి 5వ తేదీన చర్చలు జరుపుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చర్చలకు ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఏకాభిప్రాయ సాధనకు ఈ అఖిల పక్ష సమావేశంలో చర్యలు తీసుకుంటారు.